మంచిర్యాల
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే విశ్వాసం… సీఎం కేసీఆర్అంటే మోసం’ అని దుబ్బాక ఎమ్మెల్యే బి.రఘునందన్రావు విమర్శించారు. కేసీఆర్ మోసాలు రాస్తే రామాయణమంతా… చెప్పితే భాగవతం అంతా’ అన్నారు. మోడీ అంటే అమ్మకం… కేసీఆర్ అంటే నమ్మకం’ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ గ్రౌండ్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామితో కలిసి రఘునందన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ… కొత్త పార్లమెంట్ లో మొట్టమొదట మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోడీది అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పుడు సింగరేణిలో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్ లు వుండవని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశాడన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ధర్నాకు భయపడి మహిళా బిల్లును తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత చెప్పుకోవడం హాస్యాస్పందగా ఉందన్నారు.
దమ్ముంటే మీ నాయన కేసీఆర్తో కొట్లాడి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు ఇప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీ మీటింగ్ కు బీఆర్ఎస్ వాళ్లు జనాలను పంపించారని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన నిన్ను కేసీఆర్ కోర్టు మెట్లు ఎక్కకుండా కాపాడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కవితలకు వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉందని కేసీఆర్ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు…