రథం దగ్ధం పై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి సెప్టెంబర్ 24 Chandrababu అనంతపురం జిల్లాలో రథం దగ్ధం పై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జిల్లాలోని అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అగంతుకులు నిప్పుపెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసులు, అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి బయలు దేరి, గ్రామస్థులతో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. World Bank representatives meeting with…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
AP new pensions | కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… | Eeroju news
కొత్త పెన్షన్లు పై సర్కార్ కసరత్తు… కాకినాడ, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) AP new pensions ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో తొలగించిన లక్షల మంది లబ్దిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. లబ్దిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లపై త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.కొత్త పెన్షన్లకు మంజూరుకు త్వరలో నూతన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్దమవుతుంది. అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్…
Read MoreTirumala Laddu | లడ్డూ వివాదం… | Eeroju news
లడ్డూ వివాదం… నెయ్యి సరఫరా సంస్థకు షోకాజ్ నోటీసులు తిరుమల, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Tirumala Laddu తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది. నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి…
Read MoreKurnool High Court | కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ | Eeroju news
కర్నూలులో హై కోర్టు బెంచ్ బ్యాక్ స్టెప్ కర్నూలు, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Kurnool High Court కర్నూలులో హైకోర్టు పెడతామని దాన్నే న్యాయరాజధానిగా పిలుస్తామని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదేళ్లలో కనీసం హైకోర్టు బెంచ్ కోసం కూడా సిఫారసు చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో కర్నూలులో హైకోర్టు అనే విధానాన్ని విరమించుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కర్నూలు న్యాయవాదుల డిమాండ్ ను తీర్చాలని అనుకుంటోంది. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాలని మఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అమరావతికి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన తర్వాత.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి జరిగిన ప్రచారంతో.. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. అది టీడీపీ ఓటమికి కారణం అయింది. వైసీపీ ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుని మూడు…
Read MoreTet candidates | టెట్’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు | Eeroju news
టెట్’ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్, ఒకే రోజు రెండు పరీక్షలు విశాఖపట్టణం, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Tet candidates ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్టోబరు 3 నుంచి నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను విద్యాశాఖ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అయితే కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. హాల్టికెట్లనూ వేర్వేరుగా విడుదల చేశారు. దీంతో ఆ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. రెండు పరీక్షలూ ఒకేసారి రాయడం సాధ్యం కాదుకాబట్టి ఏదో ఒక పరీక్ష వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ➨ పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు మండలం, చొదిమెళ్ల గ్రామానికి చెందిన సంధ్యాభవానీకి అక్టోబరు 6న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1బి తెలుగు (1 నుంచి 5 వరకు స్పెషల్ స్కూల్స్) పరీక్షకు సమయాన్ని…
Read MoreJagan in Ashta Digbadhanam | అష్ట దిగ్భంధనంలో జగన్….. | Eeroju news
అష్ట దిగ్భంధనంలో జగన్….. విజయవాడ, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Jagan in Ashta Digbadhanam ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పర్సనల్ స్థాయికి వెళ్లిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు ప్రతీ ఒక్కరూ. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేయడం కావాలనే ఆయన్ను జైల్లో పెట్టించడం వంటి పనులు చేశారని టిడిపి శ్రేణులు అంటుంటాయి. ఇప్పుడు ఆ వంతు టిడిపికి వచ్చింది. సీఎం చంద్రబాబు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో నిజం ఎంతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా ఒక ఇష్యుపై మరొకటి చేరుతోంది. (1) తిరుపతి కల్తీ లడ్డు వివాదం ప్రస్తుతం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సైతం ఊపేస్తున్న అంశం జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి…
Read MoreVeeresh | ఆశయం ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ది చేస్తాడు | Quotations
Veeresh | ఆశయం ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ది చేస్తాడు | Quotations
Read MoreJagan | జగన్ ను అడ్డంగా బుక్ చేసిన ఎన్డీయే | Eeroju news
జగన్ ను అడ్డంగా బుక్ చేసిన ఎన్డీయే విజయవాడ, గుంటూరు, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jagan తిరుమల లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారని వివాదం రేగిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జూలైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగిందని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని…
Read MoreJagan Chalo Bangalore | ఛలో బెంగుళూరు.. | Eeroju news
ఛలో బెంగుళూరు.. కేడర్ లో బయిటపడుతున్న అసహనం అనంతపురం, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) Jagan Chalo Bangalore వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరచూ బెంగళూరుకు వెళుతూ పార్టీ నేతలకు అసహనం రేపుతున్నారు. జగన్ ఎప్పుడు అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడ క్యాడర్ నుంచి లీడర్ల వరకూ ఎలా ధైర్యంగా ఉంటారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పది సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఎవరైనా చనిపోయినా, లేకపోయినా వరదల వంటి ఆకస్మిక ఘటనలు జరిగితే విజయవాడకు వస్తున్నారు తప్పించి ఇక్కడే ఉండి రాజకీయం చేయడానికి జగన్కు మనసొప్పడం లేదంటున్నారు. ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే గడుపుతుండటం ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాదు సొంత పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.వైఎస్…
Read MoreCM Chandrababu and Jagan | లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … | Eeroju news
లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … గుంటూరు, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) CM Chandrababu and Jagan తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా రాజకీయం మారుతోంది. టీటీడీ బోర్డు స్వతంత్రంగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుంది… అని స్వయంగా సీఎం జగన్ ప్రెస్ మీట్లో చెప్పినా.. నెయ్యి కల్తీ వ్యవహారమంతా గత ప్రభుత్వం తప్పే అన్నట్లుగా ఇతర పార్టీలన్నీ ప్రొజెక్ట్ చేశాయి. వైసీపీ దాన్ని తిప్పికొట్టలేకపోయింది. తప్పు చేయలేదని బలంగా వాదించలేకపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రం అంటున్నారు. ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లెక్కి ఎవరూ ధర్నాలు చేయడం లేదు కానీ..ఉత్తరాదిలో మాత్రం జగన్కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. హిందూత్వ రాజకీయాలు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిన ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది ఉత్తరాది హిందూ…
Read More