రీవెంజ్ రాజకీయాలేనా…. విశాఖపట్టణం, జూన్ 29, (న్యూస్ పల్స్) Revenge politics in AP ఏపీలో రివేంజ్ రాజకీయాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. కానీ వస్తూ వస్తూ మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో పాలన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలని వాటిలో పొందుపరిచారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని ఒకవైపు ప్రకటిస్తూనే.. తెర వెనుక సామ, దాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన అంటూ ప్రజల్లోకి వెళ్లిన వారే.. అధికారంలోకి వచ్చాక అదే తరహా పాలన ప్రారంభించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదర్శం మాటల వరకే పరిమితం అయిందని.. చేతలు చెయ్యి దాటి పోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజులపాటు పాలనపై దృష్టి సారిస్తే గత ప్రభుత్వ వైఫల్యాలు…
Read MoreTag: AP News
Yalahanka Palace in Jagan Caraf Bangalore | జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్ | Eerjou news
జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్ అనంతపురం, జూన్ 29, (న్యూస్ పల్స్) Yalahanka Palace in Jagan Caraf Bangalore వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ మాజీ సీఎం. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం. ప్రస్తుతం ఆయన కేరాఫ్ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యలహంక ప్యాలెస్. అవును.. ఆయన ఆ ప్యాలెస్ దాటి రావడం లేదు.. ఎవ్వరిని కలవడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల్లో గెలిచినట్టు 151 సీట్లతో మనం సర్దుకుపోవద్దు. ఈసారి.. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 175 సీట్లు సాధించాల్సిందే. దీని కోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేశారు. కొత్త వారిని చేర్చారు. పాతవారిని మార్చేశారు. మరి ఇంతా చేస్తే ఏం జరిగింది. ప్రజలు…
Read MoreWhat happened to Sajjala Ramakrishna Reddy where are you ? | కనిపించని సజ్జల… | Eeroju news
కనిపించని సజ్జల… గుంటూరు, జూన్ 29, (న్యూస్ పల్స్) What happened to Sajjala Ramakrishna Reddy where are you ? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఎక్కడున్నారు? గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని, పేర్నినాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటివారు గతంలో వైసీపీ తరుఫున ప్రెస్మీట్లు పెట్టేవారు. అయితే, వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ ను తిట్టడానికే పరిమితం అయ్యేవారు. పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ కేబినెట్లో మంత్రులుగా చేసినప్పటికీ.. వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధివిధానాలు ఆయనే చెప్పేవారు.కానీ.. అధికారం చేతులు మారిన తర్వాత…
Read MoreWhy is YCP like this? | వైసీపీ అలా ఎందుకు… | Eeroju news
వైసీపీ అలా ఎందుకు… విజయవాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Why is YCP like this? లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ మద్దదు బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అంతకు ముందు ఐదేళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లు అయినా పార్లమెంట్ లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్టు చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పటిలాగా మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేనతో కలవొద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది.…
Read MoreFarmers are worried about the lack of irrigation water or crops | నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… | Eeroju news
నీరు ఏదీ… నాట్లు ఎక్కడ… కాకినాడ, జూన్ 29, (న్యూస్ పల్స్) Farmers are worried about the lack of irrigation water or crops రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారునిజానికి ఏటా జూన్, జులై…
Read MoreChandragiri MLA Pulivarthi Nani in the service of Shri Padmavati Ammavari | శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని | Eeroju news
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి Chandragiri MLA Pulivarthi Nani in the service of Shri Padmavati Ammavari శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం ఏర్పాట్లను డిప్యూటీ ఈవో గోవింద రాజన్ పర్యవేక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానీకి ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నానికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మ్రొక్కులు తీర్చుకున్న అనంతరం మూల మూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ రమేష్ ఆలయ సీనియర్…
Read MoreLeaders of Shirivella mandal met Allagadda MLA | ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు | Eeroju news
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసిన శిరివెళ్ళ మండల నాయకులు – శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేయాలని వినతి Leaders of Shirivella mandal met Allagadda MLA శిరివెళ్ల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియరెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లను శిరివెళ్ల మండల నాయకులు బుధవారం కలిశారు. బొకే అందజేసి శుభాకంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో శిరివెళ్ల మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి వీర రెడ్డి పల్లె టిడిపి నాయకులు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. శిరివెళ్ల మండల, గ్రామ అభివృద్ధి పై చర్చించారు. అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే శిరివెళ్ల మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసులు, అప్రి రెడ్డి, కృష్ణారెడ్డి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.…
Read MorePurandhreswari a period of not being together with Chinnamma | చిన్నమ్మకు కలిసి రాని కాలం | Eeroju news
చిన్నమ్మకు కలిసి రాని కాలం విజయవాడ, జూన్ 28, (న్యూస్ పల్స్) Purandhreswari a period of not being together with Chinnamma కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పడటంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదవుల పంపిణీ జరిగిపోయింది. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ లో అన్ని పార్టీలకూ అవకాశం కల్పించారు కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు అవకాశమివ్వకపోయినా కూటమిలోని టీడీపీకి మాత్రం రెండు పదవులు లభించాయి. తెలంగాణలో ఎనిమిది స్థానాలను గెలవడంతో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో మూడు పార్లమెంటు స్థానాలు దక్కడంతో ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆరుగురు గెలిచినా ఒక్కరికే రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయంటే… బలాబలాలను…
Read MoreMLC chance for those two | ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ ఛాన్స్ | Eeroju news
ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ ఛాన్స్ విజయవాడ, జూన్ 28, (న్యూస్ పల్స్) MLC chance for those two ఏపీలో మరో ఎన్నిక జరగనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వచ్చే నెలలో ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పై దృష్టి పెట్టారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి 166 స్థానాల్లో విజయం సాధించడంతో.. ఇక ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూటమి సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.…
Read MoreShock for YCP in Punganur | పుంగనూరులో వైసీపీకి షాక్ | Eeroju news
పుంగనూరులో వైసీపీకి షాక్ తిరుపతి, జూన్ 28, (న్యూస్ పల్స్) Shock for YCP in Punganur వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపిలో చేరికలు పెరిగాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. స్థానిక టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అదే జరిగితే పుంగనూరు మున్సిపల్ పీఠం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరినట్టే. పుంగనూరు నుంచి సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి కుటుంబం హవా నడుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి హవా చలాయించడం ప్రారంభించారు.…
Read More