15 లక్షల మందికి ఆరోగ్య సేవలు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Arogyasri అమరావతి అభివృద్ధికి సంబంధించి రోజుకో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కొత్త రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా సమ్మతి తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి.. విభజన తర్వాత తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో అమరావతిలో ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ…
Read MoreTag: AP News
TDP | కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి | Eeroju news
కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి అనంతపురం, తిరుపతి, నవంబర్ 11, (న్యూస్ పల్స్) TDP రాయలసీమ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడ్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ముందుగా బావబామ్మర్దులు తమ నియోజకవర్గాల్లో అంతా సెట్ చేసి పెట్టారు. ఏ టైమ్లోనైనా పీఠం తమ వశం చేసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సెగ్మెంట్లోని కుప్పం మున్సిపాలిటీలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ..తమ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అందులో నుంచి మరో కౌన్సిలర్ తిరిగి వైసీపీకి లోకి వెళ్లారు.…
Read MoreNagarjuna Sagar | ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ | Eeroju news
ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Nagarjuna Sagar ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి ‘నాగార్జున సాగర్ వివాదం’ రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్…
Read MoreRice ATM | ఏపీలో రైస్ ఏటీఎంలు | Eeroju news
ఏపీలో రైస్ ఏటీఎంలు కాకినాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Rice ATM సాంకేతికతను మరింతగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న రైస్ ఏటీఎంల విధానం ఇక్కడకూడా అమలు చేయాలని చూస్తోంది. రైస్ ఏటీఎంలు ఏర్పాటు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకునే వీలు కలుగుతుంది. అంతే కాకుండా రేషన్ దుకాణాల్లో క్యూలైన్లు లేకుండా కూడా చూడొచ్చు. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. పనికి వెళ్లే వాళ్లు తమ పనులు మానుకొని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అక్రమాలకు చెక్ పెట్టే వీలు ఉంటుంది. ఈ రైస్ ఏటీఎంలకు అనుగుణంగా ఉండేలా రేషన్…
Read MoreAP | బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు | Eeroju news
బూమ్ రాంగ్ అవుతున్న నిర్ణయాలు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) AP వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. జగన్ నేతలను కలుపుకుని వెళ్లడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఉన్నారు. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయన ఏదీ నేతలతో పార్టీ విషయాలను ముందుగా పంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. అసలు వైసీపీకి ఒక పార్టీ కార్యవర్గం ఉందా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాల్సింది. జగన్ రెండు విషయాలను ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలను…
Read MorePawan kalyan | రాజకీయాలపై జనసేనాని పట్టు | Eeroju news
రాజకీయాలపై జనసేనాని పట్టు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Pawan kalyan ఒకటి మాత్రం నిజం.. ఏపీ పాలిటిక్స్ ను దగ్గర నుంచి పరిశీలించిన వారికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉంటేనే పాలిటిక్స్ ఉంటాయి. లేదంటే లేదు అన్నట్లుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటు అధికార పక్షం గాని, అటు విపక్షం గాని పవన్ నామస్మరణ లేకుండా మాత్రం పూట గడవటం లేదు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నెంబర్ వన్ గా నిలిచారంటే వినేవాళ్లకు అతిశయోక్తి అనిపించొచ్చు గాని.. ఆయన చేతుల మీదుగానే రాజకీయాలు నడుస్తున్నాయన్నది వాస్తవం. ఆయనతో గొడవలు పెట్టుకుంటే లాస్ అయ్యేది తమదేనన్న భావన మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు బలంగా పడిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్…
Read MorePolavaram | పోలవరం ప్రాంతవాసులకు కష్టాలే.. | Eeroju news
పోలవరం ప్రాంతవాసులకు కష్టాలే.. ఏలూరు, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Polavaram ఆ ఊరు దేశం యావత్తు ప్రజలకు తెలుసు.. పర్యాటకులు అక్కడి నుంచి లాంచీలు ఎక్కుతుంటారు. ప్రధాని నుంచి మంత్రుల వరకు అక్కడేం జరుగుతోందని ఆరా తీస్తుంటారు. వారం వారం ముఖ్యమంత్రి కూడా ఆ ఊరు విజిట్ చేస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిరంతరం పర్యటిస్తుంటారు. ఇంత గొప్ప పేరున్న ఆ ఊరు చివరకు ఎటూ కాకుండా పోతుంది. వ్యాపారాల్లేవు. పనులు లేవు. అన్నీ వలసలే. బహుళార్ధ సాధక నీటి ప్రాజెక్టు ఆ ఊరి పేరు మీదే దేశవ్యాప్తంగా సుపరిచితం అయింది. అయితే ఏంటంటారా, పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటున్నారు ఆ ఊరు వాళ్ళు. ఆ ఊరే జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్న పోలవరం. పోలవరానికి అభివృద్ధి అందని ద్రాక్ష అయింది.…
Read MoreBhavani Deekshalu | నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు | Eeroju news
నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు విజయవాడ, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Bhavani Deekshalu ఏటా కార్తీక మాసంలో మొదలయ్యే భవానీ దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ దీక్షలు చేపడతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు ధరిస్తారు. ఏటా లక్షలాది మంది భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుంటారు. 2007 వరకు దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించే వారు. దసరా ఉత్సవాల చివరి రోజుల్లో దీక్షల విరమణ చేసేవారు. భవానీ దీక్షదారుల్ని దర్శనాలకు అనుమతించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో దసరా ఉత్సవాలో సంబంధం లేకుండా భవానీ దీక్షల్ని చేపడుతున్నారు. ఈ…
Read More32 Acres Sports Complex in AP | తిరుపతిలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ | Eeroju news
తిరుపతిలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి, నవంబర్ 9, (న్యూస్ పల్స్) 32 Acres Sports Complex in AP ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( శాప్) ఛైర్మన్ అనిమేని రవి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. సరికొత్త ప్రణాళికలతో రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాభివృద్ధి కోసం నూతన క్రీడా పాలసీ తెచ్చినట్లు వివరించారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించిన నూతన క్రీడా పాలసీలోని పలు అంశాలపై చర్చించారు. అలాగే…
Read MoreCM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news
కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. విజయవాడ, నవంబర్ 9, (న్యూస్ పల్స్) CM Chandra babu కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి.పైగా టిడిపి సహకారం లేనిది కేంద్ర ప్రభుత్వం నడవని పరిస్థితి.ఈ తరుణంలో టిడిపికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే..పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టాలని భావిస్తోంది.అందులో భాగంగా రూ.5407 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం అనకాపల్లి, కృష్ణ, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లనిర్మాణాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అయితే ఇచ్చాపురంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు…
Read More