హైడ్రా.. యాప్ రెడీ హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) HYDRA హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల విస్తీర్ణంపై సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నెలలలోపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలు సేకరించి వెబ్ సైట్ లో వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని, అందులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్…
Read MoreTag: Eeroju news
YS Sharmila | షర్మిళ రివర్స్ బాణం | Eeroju news
షర్మిళ రివర్స్ బాణం విజయవాడ, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) YS Sharmila ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ స్పీడ్ పెంచారా.. ఒక వైపు కూటమికి, మరోవైపు వైసీపీకి తన కామెంట్స్ తో షాకిస్తూ.. రాజకీయంగా బలోపేతం కానున్నారా.. పక్కా వ్యూహంతో ఏపీలో కాంగ్రెస్ ను బలమైన పార్టీగా నిలపాలన్న తన లక్ష్యం వైపు షర్మిళ సాగుతున్నట్లు ఏపీ కాంగ్రెస్ ముఖచిత్రం కనిపిస్తోంది.మొన్నటి వరకు తన అన్న మాజీ సీఎం జగన్ లక్ష్యంగా.. విమర్శల వర్షం కురిపించిన షర్మిళ.. తన గురి కూటమి వైపుకు తిప్పినట్లు ఉందని తాజాగా ఆమె విమర్శలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తాను ముందుంటానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి షర్మిళ ఘాటుగానే స్పందించారు.అధికారం లేని సమయంలో…
Read MoreGovt in Hydra demolitions | హైడ్రా కూల్చివేతలలో ప్రభుత్వం పురాలోచన..! | Eeroju news
హైడ్రా కూల్చివేతలలో ప్రభుత్వం పురాలోచన..! హైదరాబాద్ Govt in Hydra demolitions ఓవైపు అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ మరోవైపు చెరువులు ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలు వాటిని వ్యతిరేకిస్తూ బాధి తుల నుంచి నిరసనలు పెరిగిపోవడంతో ప్రభుత్వ అధికార వర్గాలు పురాలోచనలో పడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించా లని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గ్రేటర్లోని చెరువుల విస్తీ ర్ణం, ఎఫ్ టి ఎల్ బఫర్జోన్, లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఎఫ్టీఎల్,బఫర్ జోన్ లో ఆక్రమణలు హైడ్రా కూల్చివేసిన సంగతి…
Read MoreNew Revenue Act Telangana | త్వరలోనే తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం..! | Eeroju news
త్వరలోనే తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం..! హైదరాబాద్ New Revenue Act Telangana త్వరలోనే తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం దేశానికి రోల్ మోడల్గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో సమావేశమయ్యారు. Large scale solar plants in Telangana | తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు | Eeroju news
Read MoreTelangana | బఫర్ జోన్లు.. ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే | Eeroju news
బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెరువులు, జలాశయాల FTL, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చాలని.. సర్వే పూర్తి చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో HMDA పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ సెక్రటేరియట్ లో సోమవారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే…
Read MoreIPS Sunil Kumar | మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్ | Eeroju news
మరిన్ని చిక్కుల్లో ఐపీఎస్ సునీల్ కుమార్ విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) IPS Sunil Kumar వైఎస్ఆర్సీపీ హయాంలో కీలకంగా పని చేసి ప్రస్తతం పోస్టింగ్ లేకండా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత జూలైలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై పదిహేను రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. పీవీ సునీల్ కుమార్ నుంచి స్పందన వచ్ిచన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా పని చేశారు.ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజును రాజద్రోహం కింద సుమోటోగా…
Read MoreMaldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news
మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ న్యూఢిల్లీ, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Maldives vs Modi మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి. హైదరాబాద్ హౌస్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అదే సమయంలో రూపే కార్డు ద్వారా చెల్లింపు మాల్దీవులలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ తొలిసారిగా ఇలాంటి లావాదేవీలకు శ్రీకారం చుట్టారు.మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం…
Read MoreAP Rains | ఈ నెల 10 నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు | Eeroju news
ఈ నెల 10 నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అమరావతి అక్టోబర్ 7 AP Rains ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 10 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.ఆదివారం ఏలూరు, తూర్పుగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు నంద్యాల, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53…
Read MoreRegent International | ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. 20 వేల మంది నివాసం.. | Eeroju news
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. 20 వేల మంది నివాసం.. న్యూ డిల్లీ అక్టోబర్ 7 Regent International ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ ను ఎప్పుడైనా చూశారా..? పోనీ ఎక్కడ ఉందో తెలుసా..? రీజెంట్ ఇంటర్నేషనల్’ ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్. ఇది చైనాలోని కియాన్జియాంగ్ సెంచురీ నగరంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసితులు ఉన్నారు.675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలుస్తోంది. మొత్తం 39 అంతస్తుల్లో ఈ భవంతిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ‘ఎస్’ ఆకారంలో నిర్మించారు. ఇందులో గరిష్ఠంగా 30 వేల మంది నివసించొచ్చు. ఇక ఈ భారీ నిర్మాణం అనేక సౌకర్యాలు, వసతులను కలిగి ఉండడం మరో విశేషం.ఇందులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, స్కూళ్లు,…
Read MoreSunita Williams | అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్ | Eeroju news
అంతరిక్ష కేంద్రం నుంచి ఓటును వినియోగించుకోనున్న సునీత విలియమ్స్ న్యూ డిల్లీ అక్టోబర్ 7 Sunita Williams నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు.బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్లో చేపట్టిన స్టార్లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వారు స్పేస్ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఐఎస్ఎస్లో కమాండర్గా విధులు…
Read More