కోవర్టులు పై వేటు తప్పదా… విజయవాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Coverts ఎన్నికల్లో టిడిపి సూపర్ విక్టరీ సాధించింది. సొంతంగానే 135 స్థానాల్లో విజయం సాధించింది. కూ టమిపరంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది.ఈనెల 20వ తేదీతో వందరోజుల పాలన పూర్తవుతుంది. దీంతో మూడు పార్టీలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు కొన్ని రకాల లోపాలను సరి చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరును మదించనున్నారు. కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం దిద్దుబాటు చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనున్నట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా,ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా…
Read MoreTag: Eeroju news
Steel Plant | తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ | Eeroju news
తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Steel Plant ఏపీలో మరోసారి స్టీల్ ప్లాంట్పై రచ్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజముందో కాని.. వైసీపీ ఇప్పుడు దాన్నే అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దానికి కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి తీరప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేతకు కారణమైంది. విశాఖ ఉక్క, ఆంధ్రుల…
Read MorePawan Kalyan | పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ | Eeroju news
పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్ కాకినాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉండగా తమకు ఎదురేలేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తే… కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ… కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్పై మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్…. స్థానిక ఎమ్మెల్యే పవన్ ఒక్కమాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్ సినిమాల్లో నటిస్తే… సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. గతంలో…
Read MoreAP | విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత | Eeroju news
విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) AP శాఖలో నూనె వ్యాపారులు కృత్రిమ కొరత గేమ్ మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్గా మారిపోయి నూనె అమ్మకాల్ని రెండ్రోజుల పాటు నిలిపేసి కృత్రిమ డిమాండ్ సృష్టించేశారు. శని, ఆదివారాల్లో నూనె అమ్మకాలుండవంటూ చిరు వ్యాపారులకు వర్తమానం పంపించేశారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు జెల్ల కొట్టేలా శనివారం తెల్లవారుజాము నుంచే వ్యాపారులు 30 శాతం ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ ఆయిల్పై.. అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబయి,…
Read MoreBanjara festival | అనంతలో బంజరాలు పండుగ సందడి | Eeroju news
అనంతలో బంజరాలు పండుగ సందడి అనంతపురం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Banjara festival సింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బంజారాలు హర్యాలీ తీజ్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బంజారా కళలను కనుమరుగు కాకుండా వాటికి జీవం పోస్తూ నేటికీ వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. రాను రానూ మారుతున్న కాలానుగుణంగా బంజారాల తీజ్ పండుగను అక్కడక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఈ ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన తీజ్ ఉత్సవాలను కన్యలు పండుగ జరపాలని గ్రామ పెద్ద…
Read MoreRoja | రోజా రిటర్న్స్… | Eeroju news
రోజా రిటర్న్స్… తిరుపతి, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Roja కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా. తన సొంత నియోజకవర్గంలో నగరిలో అంతా సెట్ చేసుకోడానికి చకచకా పావులు కదుపుతున్నారు. తన ఓటమి కారణమైన సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన తన కసిని తీర్చుకున్నారు. నగరిపై మళ్లీ పట్టు పెంచుకునేలా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. మూడేళ్లుగా నగరిలో రోజాకు ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. అధికార పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రోజాకు సంతోషం ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల వరకు ఆమెకు ఇంటాబయటా సమస్యలే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే రోజాను ఓడించేందుకు…
Read MoreVande Bharat Train | 19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ | Eeroju news
19 నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్స్ హైదరాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Vande Bharat Train మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే శాఖ.. రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రయాణికులను ఆట్టుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ రైళ్లను రూపొందించింది. ఏడాదిగా వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా కేంద్రం వందే భారత్ రైళ్లను కేటాయించింది. తాజాగా మరో రెండు రైళ్లను రెండు తెగులు రాష్ట్రాల మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈమేరకు రూట్లు ఖరారు చేసింది. సెప్టెంబర్ 16న ఒకేసారి ఆరు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన రెండు వందే…
Read MoreNominated posts by Dussehra | దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు | Eeroju news
దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Nominated posts by Dussehra ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్…
Read MoreAchchennaidu | అధికారులకు అచ్చెన్నాయుడు స్మూత్ వార్నింగ్ | Eeroju news
అధికారులకు అచ్చెన్నాయుడు స్మూత్ వార్నింగ్ శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Achchennaidu టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు ప్రభుత్వ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సిబ్బందిపై ఆరా తీశారు. మొదటిసారిగా క్షమించి వదిలేస్తున్నాను.. ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారని తన దృష్టికి వస్తే మాత్రం క్షమించేది లేదన్నారు. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదు.. ప్రజల కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. ఏ అధికారైనా సరే ఆఫీస్ పనులు నిమిత్తం బయటకు వెళితే పరవాలేదు, వ్యక్తిగత పనులకు మాత్రం ఊరకనే వెళ్తే మాత్రం తాను రంగంలో దిగవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడైతే అచ్చెన్నాయుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిగెత్తారు, ఇక అధికారులు పరుగులు పరుగున అక్కడికి చేరుకొని.. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలపై ఆయనకు వివరించారు. ఇక మీరు ఏం చేస్తారో…
Read MoreBhuma Akhilapriya | భూమా వారి రెడ్ బుక్ రెడీ | Eeroju news
భూమా వారి రెడ్ బుక్ రెడీ కర్నూలు, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Bhuma Akhilapriya ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందని, అందులో చాలా మంది చెడ్డోళ్ల పేర్లున్నాయని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. తాను ఎవరినీ వదలబోనని స్పష్టం చేశారు. నేనసలే ఊరుకునే దానిని కాదన్నారు. వారు అధికారంలో ఉండగా తమ వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, ఇప్పుడు వదులుతానని ఎలా అనుకున్నారని ఆమె ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరినీ వదిలి పెట్బబోమని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చింది తన రాజకీయ ప్రత్యర్థులైన గంగుల కుటుంబంతోనూ, టీడీపీలోనే ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైరం ఉంది. ఎవరిని ఉద్దేశించి అఖిలప్రియ…
Read More