Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం | Eeroju news

Gudlavalleru Engineering College

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం గుడివాడ Gudlavalleru Engineering College   లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు…

Read More

Revanth reddy | నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ | Eeroju news

Revanth reddy

నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ హైదరాబాద్ Revanth reddy కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.   Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news

Read More

KCR | రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? | Eeroju news

KCR

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? హైదరాబాద్ KCR బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు.ఈ బీఆర్ఎస్ పోరాటంపై శనివారం సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై…

Read More

Revanth Reddy | రేవంత్ వ్యూహం | Eeroju news

రేవంత్ వ్యూహం

రేవంత్ వ్యూహం హైదరాబాద్, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Revanth Reddy   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఒవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుంది.అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణమున్నట్లే.. ఒవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని…

Read More

Online registration | ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ | Eeroju news

ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Online registration సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.పౌర ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో, ఉండవల్లి నివాసం వద్ద పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సైతం…

Read More

Roads | కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు | Eeroju news

కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు

కేంద్ర నిధులతో మూడు జిల్లాలకు రోడ్లు కడప, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Roads ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడం వెనుక మతలబు ఏమిటని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంపై బిల్డర్స్‌ అసోసియేషన్‌ వివరణ ఇచ్చింది. కోవిడ్ తర్వాత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు 50ఏళ్ల నిడివితో నాలుగు శాతం వడ్డీలకు కేంద్రం అప్పులు ిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ప్రత్యేక సహాయం’ కేటగిరీ లో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రాజెక్టులకు ఇటీవల బిల్లులు చెల్లించారు. ఈ పథకంలో కేంద్రం నుంచి సహాయాన్ని…

Read More

Aadhaar | లడ్డూలకు ఇక ఆధార్ తప్పనిసరి | Eeroju news

Aadhaar

లడ్డూలకు ఇక ఆధార్ తప్పనిసరి తిరుమల, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Aadhaar   తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది.టీటీడీ కొత్త రూల్స్ ప్రకారం…. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్క లడ్డూనే ఇవ్వనున్నారు. ఇక అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది.టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఆంక్షలు సరికాదని అంటున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ విధానం అమలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. లడ్డూ ఆంక్షలపై టీటీడీ నుంచి…

Read More

Hydra | ఏపీలోనూ హైడ్రా..? | Eeroju news

ఏపీలోనూ హైడ్రా..?

ఏపీలోనూ హైడ్రా..? విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Hydra తెలంగాణ‌లో ‘హైడ్రా’ చ‌ర్య‌ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపిలో కూడా అలాంటి త‌ర‌హా చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వంలో చ‌ర్చ జ‌రుగుతోంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ‌ మాదిరిగా చెరువులు, న‌ల్లాల‌ను ఆక్ర‌మించుకుని చేసిన‌ నిర్మాణాల‌కంటే… ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేసి, స్థలాల‌ను ఆక్ర‌మించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎక్కువగా ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగ‌ని అంత‌కుముందున్న ప్ర‌భుత్వంలో కూడా సర్కార్ భూముల క‌బ్జాపై ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు అన్ని జిల్లాల్లోనూ ప్ర‌భుత్వ భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.అయితే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌న‌ేది ఆసక్తిగా ఉంది. ప్ర‌భుత్వ…

Read More

Is YCP turning into BRS? | బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… | Eeroju news

Is YCP turning into BRS?

బీఆర్ఎస్ గా వైసీపీ మారుతోందా… నెల్లూరు, ఆగస్టు 30, (న్యూస్ పల్స్) Is YCP turning into BRS? ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఏ పార్టీకి అయినా ఉథ్థానపతనాలు తప్పవు. కానీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మీద నేతలు, క్యాడర్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఇటు ఏపీ రాజకీయాల్లో సోనియా గాంధీని ఎదిరించిన లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. కేసీఆర్ 2014లో తెలంగాణలో అధికారంలోకి రాగా, జగన్ 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్…

Read More

Kavitha met KCR | కేసీఆర్ ను కలిసిన కవిత | Eeroju news

Kavitha met KCR

కేసీఆర్ ను కలిసిన కవిత హైదరాబాద్ Kavitha met KCR ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కన్నబిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురైయారు.జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.   Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news

Read More