Sirisila is the top in cell phone recovery | సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్ | Eeroju news

Sirisila is the top in cell phone recovery

సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్ కరీంనగర్, జూలై  30, (న్యూస్ పల్స్) Sirisila is the top in cell phone recovery గత కొన్ని రోజుల నుండి పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు సిరిసిల్ల పోలీసులు.. గత ఏడాది ఏప్రిల్ 20 నుండి జులై 28వ తేదీ వరకు జిల్లాలో 1,200 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్ పోయిందంటే టెన్షన్ పడవద్దని.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని పోలీసులు నిరూపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లను సబంధిత బాధితులకు అందించారు. 84శాతం రికవరీ ఫోన్లతో…

Read More

KCR’s new plan | కేసీఆర్ నయా ప్లాన్ | Eeroju news

KCR's new plan

 కేసీఆర్ నయా ప్లాన్ హైదరాబాద్, జూలై  30, (న్యూస్ పల్స్) KCR’s new plan బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. వరస ఓటములతో కుదేలయిపోయిన ఆ పార్టీ ఇక సంచలన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తుంది. లేకుంటే పార్టీ మనుగడ కష్టసాధ్యమని అగ్రనాయకత్వం గుర్తించినట్లుంది. అందుకోసమే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దీనిపై కసరత్తులు ప్రారంభించారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అప్పుడే ప్రజలు కొంత పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే ప్రజల్లో వ్యతిరేకత ఉండదని, దీంతో పాటు న్యూ ఫేస్ లు జనం ముందుకు తేవడం వల్ల కొంత పాజిటివ్ వే లో వెళ్లవచ్చన్న వ్యూహంలో ఉన్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. తాము ఎన్ని సంక్షేమ పథకాలను…

Read More

CM Nara Chandrababu | సీఎంకు కత్తిమీద సామే…. | Eeroju news

CM Nara Chandrababu

సీఎంకు  కత్తిమీద సామే…. తిరుపతి, జూలై 30, (న్యూస్ పల్స్) CM Nara Chandrababu నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ ను ఈ దఫా గట్టును పడేయటం చంద్రబాబుకు కత్తిమీద సామే అవతున్నట్లు కనపడుతుంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలను బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు. సూపర్ సిక్స్ ను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన ఏపీ అప్పుల చరిత్రను చూసిన తర్వాత నిజం తెలిసి ఉండవచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి దీని నుంచి బయట పడేస్తారని సహచర మంత్రులతో పాటు పార్టీ…

Read More

New liquor policy after Dussehra | దసరా తర్వాతే మద్యం కొత్త పాలసీ… | Eeroju news

New liquor policy after Dussehra

దసరా తర్వాతే మద్యం కొత్త పాలసీ… విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) New liquor policy after Dussehra ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడానికి మరికొన్ని నెలలు సమయం పట్టనుంది. ప్రస్తుత మద్యం పాలసీ గడువు 2024 అక్టోబర్ వరకు ఉండటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అప్పటి వరకు పాత విధానాన్నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా…

Read More

3 schemes from August 15 | ఆగస్టు 15 నుంచి 3 పథకాలు | Eeroju news

3 schemes from August 15

ఆగస్టు 15 నుంచి 3 పథకాలు విజయవాడ, జూలై  30, (న్యూస్ పల్స్) 3 schemes from August 15 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నుంచి మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు… మరో వైపు ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో 184 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం కొన్ని కారణాలతో మొదట వంద ఏర్పాటు చేయాలని మిగిలిన 84 సెప్టెంబర్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందివ్వాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం వివిధ పట్టణాల్లో ప్రత్యేక భవనాలు నిర్మించారు.…

Read More

Krishna Teja in ground work | గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ | Eeroju news

గ్రౌండ్ వర్క్ లో కృష్ణతేజ

గ్రౌండ్ వర్క్ లో   కృష్ణతేజ కాకినాడ, జూలై  30, (న్యూస్ పల్స్) Krishnateja in ground work ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏపీకి వచ్చిన కేరళ కేడర్ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ గ్రాండ్ వర్క్ షురూ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కృష్ణతేజ రంగంలోకి దిగారు. పిఠాపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలపై ఫోకస్ చేసి, వారికి చేరువ అయి కష్టాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ఐఏఎస్ కృష్ణతేజ ప్రధానంగా తాగునీటి సమస్య పై దృష్టిసారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని…

Read More

YCP leaders who believed in silence | మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు | Eeroju news

YCP leaders who believed in silence

మౌనాన్నే నమ్ముకున్న వైసీపీ లీడర్లు విజయవాడ, జూలై  30, (న్యూస్ పల్స్) YCP leaders who believed in silence వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం యాభై మంది వరకూ ఉంటారు. పార్టీ ఓడిపోక ముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్ కూ కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలా మంది స్పందించడం లేదు. కొంత మంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవడం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకుని చాలా మంది అనుకుంటున్నారు. వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సీనియర్…

Read More

20 thousand crores coming to Andhra | ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు | Eeroju news

20 thousand crores coming to Andhra

ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) 20 thousand crores coming to Andhra కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల నుంచి  20వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. బిహార్‌కు 5 నుంచి 10వేల కోట్ల సాయం అందనుంది.  ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల ఈసారి కేంద్ర ఖజానాపై 25వేల నుంచి 30వేల కోట్ల రూపాయల భారం పడనుందని ఆర్థిక శాఖ చెబుతోంది.  ‘రాష్ట్రాల అభ్యర్థనలపై అందించే ప్రత్యేక సాయం’  పద్దు కింద ఏపీ, బిహార్‌కు సాయం అందించే అవకాశం ఉంది. ఈ పద్దుకు ఈసారి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ హెడ్ కింద కేటాయింపులు…

Read More

Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy | దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన | Eeroju news

దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన

దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూలై 29 Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. విభజన చట్టంలో లేని స్పీకింగ్ ఆర్డర్‌ను విద్యుత్ విషయంలో 54 శాతం తెలంగాణకు వచ్చేలా జైపాల్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి…

Read More

Buffaloes | మా గేదెలు వెతికి పెట్టండి | Eeroju news

Buffaloes

మా గేదెలు వెతికి పెట్టండి అమరావతి పోలీసుల దగ్గరకు పెద్ద ఎత్తున మహిళలు విజయవాడ, జూలై 29 (న్యూస్ పల్స్) Buffaloes ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా వంద మంది అమరావతి రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని పోలీసులు కంగారు పడ్డారు. అంతమంది ఒక్కసారే స్టేషన్ వద్దకు రావడానికి కారణమేంటా అని ఆరా తీశారు. చివరికి డిఎస్పీ అశోక్ కుమార్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాజధాని వాసుల ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే…  ఉదయాన్నే పొలానికి వెళ్లిన గేదెలు తిరిగి రాలేదు. దీంతో వెలగపూడి, మందడం గ్రామాలకు చెందిన రైతులు వాటి కోసం రాత్రి సమయంలో వెదకటం మొదలు పెట్టారు. అయితే ఒక రైతు దట్టంగా పెరిగిన చెట్ల మధ్య…

Read More