ఈసారి కుడా….కోడిదే పై చేయ్యి
విజయవాడ
హైకోర్టు ఆదేశించినా, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా షరామాములుగా ఈ ఏడాదీ ఖాకీపై కోడి పైచేయి సాధించింది. పండగ మూడు రోజులూ కోళ్లు కత్తులు దూ యగా… రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఖాకీలు ప్రేక్షక పాత్ర పోషించారు. ఫలితంగా కోట్లు చేతులు మారా యి. సామాన్యులు జేబులు గుళ్లయ్యా యి.పండుగ వారం రోజుల ముందు నుంచే పోలీసులు అవగాహనా సమా వేశాలు నిర్వహించారు. కోడిపందేలు జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పలువు రిని బైండోవర్ చేశారు.
ఆఖరి అస్త్రంగా మైక్ ద్వారా సైతం ప్రచారం చేయించా రు. ఇవేమీ కోడి పందేలను ఆపలేకపో యాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 బరుల్లో మూడు రోజుల పాటు కోడి పందేలతో పాటూ గుండాటలు, పేకాటలు జోరు గా సాగాయి. మొత్తంగా ఈ ఏడాది పండగ సీజన్లో దాదాపు 500 కోట్లుపైనే సొమ్ములు చేతులు మారినట్లు అంచ నా.కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురంలో భారీ స్థాయిలో పందే లు జరిగాయి. పండుగ మూడు రోజు లు ఇక్కడ హైటెక్ హంగులు కనిపిం చించాయి. వాహనాల పార్కింగ్ కు పెద్ద ఖాళీ స్థలం కూడా ఏర్పాటు చేశారంటే ఎంత స్థాయిలో పందేలు, జూదాలు జరిగాయో అర్ధం అవుతుం ది. వీఐపీల కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. రోజుకు 40 పందేల చొప్పున నిర్వహి స్తున్నారు.పిఠాపురం మండలం ఎఫ్.కె.పాలెంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావర ణం చోటు చేసుకుంది. ఈ వివాదంలో నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో ఇద్దరి మధ్య జరిగిన కోట్లాటలో ఒకరికి తీవ్ర గాయా లయ్యాయి. పలుచోట్ల పోలీసులు దాడులు చేపసి బరులను ధ్వంసం చేశారు