ఆలయాన్ని శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు అనంతరం తన స్వహాస్తలతో స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేశారు