కొనసాగుతున్న ట్రాఫిక్ రద్దీ
యాదాద్రి
సంక్రాంతి పండగకి సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులంట సెలవులు ముగియ్యాడంతో తిరిగి పట్టణం వైపు ప్రయాణమయ్యారు. దీనితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దిగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్దకు హైదరాబాద్ వైపుగా వేయిలాది కార్లు వస్తున్నాయ్. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉండడంతో నిమిషాల వ్యవదిలోనే టోల్ గేట్ దాటి వెళ్తున్నాయ్. సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి చౌటుప్పల్ వద్ద పెద్ద ఎటున వాహనాలు జామ్ అయిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్కు బర్గెట్లు వేసి లోకల్ ట్రాఫిక్ వాళ్ళ జాతీయ రహదారి పై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ సజావుగా సాగుతుంది