మంజీరా విద్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మెదక్
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంజీరా విద్యాలయంలో నేడు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ .పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు, సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. స్త్రీలు బొడ్డెమ్మను దశమి రోజు నుంచి ఆరంభిస్తారు. మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మలను బతుకమ్మతోపాటు నిమజ్జనం చేస్తారు.
తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు.మొదటి రోజు అమావాస్య రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో వచ్చి పిల్లలందరూ బతుకమ్మలు ,కోలాటాలు ఆడి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల
ప్రిన్సిపల్ సురేష్, కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, మీనా, పాల్గొన్నారు.