బొత్స పోటీ వెనుక వ్యూహం… విశాఖపట్టణం, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) The strategy behind botsa competition… విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించడం వైసీపీలోనే చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం అసలు బొత్స సొంత గూడు కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అభ్యర్థిత్వానికి అంగీకరించడమే. బొత్స కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదని కానీ జగన్ కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి పిలిచి బలవంతంగా అంగీకరింప చేసి ప్రకటించారని అంటున్నారు.ఓటమి తరువాత బొత్స పెద్దగా మీడియా ముందుకు కూడా రావటం లేదు. వచ్చినా నామ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు ఆయన సిద్ధంగా లేకపోయినా జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
Focus on filling nominated posts | నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ | Eeroju news
నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ విజయవాడ, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Focus on filling nominated posts ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్లు పార్టీ నేతలు పని చేసిన విధానం, ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు, భవిష్యత్ అవసరాలు, ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకొని ఈ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. పార్టీలో ఎవరికి ఏ నామినేటెడ్ పోస్టు వస్తుందనే విషయం పక్కన పెడితే… అసలు కూటమి పార్టీల మధ్య సర్దుబాటు మెయిన్ టాస్క్గా ఉంది. కూటమి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతలా కవ్వించినా కూటమి నేతలు ఎక్కడా గీత దాటకుండా పని చేస్తూ వచ్చారు.…
Read MoreCM Jagan Mohan Reddy | మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ | Eeroju news
మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ అమరావతి ఆగష్టు 7 CM Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దాంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ బాధ్యత ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో న్యాయమూర్తి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా అని అడిగారు. దానికి అటార్నీ జనరల్ వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతానని కోర్టుకు విన్నవించుకున్నారు.…
Read MoreRoja enters Tamil politics… | తమిళ రాజకీయాల్లోకి రోజా… | Eeroju news
తమిళ రాజకీయాల్లోకి రోజా… తిరుపతి, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) Roja enters Tamil politics… ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా… తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో కీలకంగా పని చేసిన రోజా… చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఇక తన వాగ్ధాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్గా మారిన రోజా… స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్పై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం…
Read MoreCM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news
సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు విశాఖపట్టణం, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) CM Chandrababu ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన,…
Read MoreRation Card… Conditions Apply | రేషన్ కార్డు…. కండిషన్స్ అప్లై | Eeroju news
రేషన్ కార్డు…. కండిషన్స్ అప్లై విజయవాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) Ration Card… Conditions Apply జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తారు. రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలను నిర్దేశించింది తెల్ల రేషన్ కార్డు సామాన్యులకు ఎంతో ముఖ్యమైంది. రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. రేషన్ కార్డును దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహారశాఖ ద్వారా పేదలకు రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే పేదలకు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన…
Read MoreSand booking in the secretariats | ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్ | Eeroju news
ఇక సచివాలయాల్లోనే ఇసుక బుకింగ్, కాకినాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) Sand booking in the secretariats ఉచిత ఇసుక పథకంలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఉచిత ఇసుకను సచివాలయాల్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్టి తెలుగు చేసిన సూచనల్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఉచిత ఇసుక పథకం అమలులో సూచించిన పరిష్కారాలను అమలు చేసేందుకు గనుల శాఖ మొగ్గు చూపింది. ఇసుక రీచ్లలో సామాన్యులకు ఇసుక కొనే పరిస్థితులు లేకపోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని సవివరంగా వివరిస్తూ వెలువరించిన కథనాలకు సిఎంఓ స్పందించింది. ఏపీలో నిర్మాణరంగానికి గుదిబండగా మారిన ఇసుక లభ్యతలో కీలక మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. మొదట వచ్చిన…
Read MoreWhat is Jagan’s strategy behind petitions in courts? | కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? | Eeroju news
కోర్టుల్లో పిటిషన్ల వెనుక జగన్ వ్యూహం ఏమిటి ? విజయవాడ, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) What is Jagan’s strategy behind petitions in courts? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో రెండు అంశాల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని .. మరొకటి తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పిచాలని ఆదేశించాలని కోరుతూదాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు కాస్త అతిశయంగా ఉన్నాయని కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవు… అలాగే సీఎంలకు మాత్రమే సీఎం స్థాయి సెక్యూరిటీ ఇస్తారు కానీ ఇతరులకు ఇవ్వరు. ఈ విషయాలపై కనీస అవగాహన జగన్ లీగల్ టీమ్కు ఉండదా ..?. అయినా ఎందుకు పిటిషన్లు…
Read MoreAre the clothes on the side? Have you done the side? | సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… | Eeroju news
సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… గుంటూరు, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) Are the clothes on the side? Have you done the side? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనపడుతుంది. ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజీ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో మాట్లాడటం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్ కు చేరవేయడంలో…
Read MoreAnother key in AP is the cancellation of the scheme | ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..! | Eeroju news
ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..! Another key in AP is the cancellation of the scheme ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ, వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం…
Read More