Lokesh steps in with a clear plan | పక్కా ప్లాన్ తో లోకేష్ అడుగులు | Eeroju news

Lokesh steps in with a clear plan

పక్కా ప్లాన్ తో లోకేష్ అడుగులు గుంటూరు, జూన్ 22, (న్యూస్ పల్స్) Lokesh steps in with a clear plan : ఏపీ మంత్రి లోకేష్.. జెట్ స్పీడ్ తో పని మొదలు పెట్టేశారు. టీడీపీ గత ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేసినా.. ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు. స్పీడ్ పెంచేశారు. జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతల స్వీకారానికి ముందే రంగంలోకి దిగేశారు. మంగళగిరి నియోజకవర్గం ఏర్పడ్డ 39 ఏళ్లలో అక్కడ టీడీపీకి అసలు విజయమే లేదు. కానీ నారా లోకేష్ రెండో ప్రయత్నంలోనే మంగళగిరిపై టీడీపీ జెండా ఎగరేశారు.తెలుగుదేశం పార్టీకి రికార్డు విజయం సాధించి పెట్టారు. రికార్డు సృష్టించేలా చేశారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే గెలవాలి అన్న లక్ష్యంతో పని చేశారు నారా లోకేష్. నిజానికి చంద్రబాబు…

Read More

A master plan is ready for Amaravati | అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ | Eeroju news

A master plan is ready for Amaravati

అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ విజయవాడ, జూన్ 22, (న్యూస్ పల్స్) A master plan is ready for Amaravati : ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రాజధాని అనేది కీలకం. కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా పోయింది. రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అమరావతిని చిదిమేసింది. రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల చెర వీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కీలకమైన నిర్మాణాలను పునః ప్రారంభించాల్సి ఉంటుంది. * ఐకానిక్ టవర్స్ : అమరావతిలో ఐకానిక్ టవర్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే చాలా వాటి నిర్మాణం పూర్తయింది.…

Read More

Traceless rain | జాడ లేని వాన | Eeroju news

Traceless rain

జాడ లేని వాన ఒంగోలు, జూన్ 22, (న్యూస్ పల్స్) Traceless rain : ఏడాది డేంజర్ బెల్స్ మోగినట్లే కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాన జాడలేదు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఈనెల 2న వాటి రాక ప్రారంభమైంది. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్ర పై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు సెగలు కక్కుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు ప్రాంతాలు తప్ప వర్షాలు జాడలేదు. చెప్పుకోదగ్గ వానలు పడడం లేదు. పైగా రాష్ట్ర మంత్రుల నిప్పుల కుంపటిని తలపిస్తోంది.…

Read More

Praveen Prakash regrets… | ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం | Eeroju news

ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం… విజయవాడ, జూన్ 22, (న్యూస్ పల్స్ Praveen Prakash regrets… : ప్రవీణ్ ప్రకాష్.. జగన్ అస్మదీయ అధికారి. అత్యంత వీర విధేయుడు. జగన్ ముందు వంగి వంగి నమస్కారాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఈయన.. గత ఐదేళ్ల వైసిపి పాలనలో మాత్రం ఎన్నెన్నో విమర్శలను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఇబ్బంది పెట్టారన్న అపవాదులు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో అంటగాకినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈయనపై వేటు పడింది. సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది. అయితే ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు ప్రవీణ్ ప్రకాష్. పాఠశాల విద్యాశాఖలో తాను ఎవరిని అవమానించలేదని.. ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి…

Read More

Food distribution to 2.14 lakh people per day | రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం | Eeroju news

Food distribution to 2.14 lakh people per day

రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం తిరుమల, జూన్ 22, (న్యూస్ పల్స్) Food distribution to 2.14 lakh people per day : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు.  టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు  గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో…

Read More

Bulk Airline Works | వడివడిగా విమానశ్రయ పనులు | Eeroju news

Bulk Airline Works

వడివడిగా విమానశ్రయ పనులు విజయనగరం,జూన్ 22, (న్యూస్ పల్స్) Bulk Airline Works : భోగాపురం విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. త్వరితగతిన ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే పై దూసుకుపోయేలా చర్యలు చేపట్టాలని ఇటు నూతన రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకోసం నిరంతరం పర్యవేక్షిస్తుంది ఎపిఎడిసిఎల్. ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికం. ఇటు విశాఖకు, అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉన్న భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగితే ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపికి కేటాయించిన కీలక ప్రాజెక్ట్స్‌లో…

Read More

Doubts on the secrets of Rushikonda | రుషికొండ రహస్యాలపై అనుమానాలు | Eeroju news

Bulk Airline Works

రుషికొండ రహస్యాలపై అనుమానాలు విశాఖపట్టణం, జూన్ 22, (న్యూస్ పల్స్) Doubts on the secrets of Rushikonda : విశాఖ పర్యాటక కేంద్రం. రుషికొండ అందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చే ముందు వరకు రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24 కలిపి మొత్తం 58 గదులు ఉండేవి. పర్యాటకులు ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకుని అక్కడ బస చేసే వారు. రెస్టారెంట్‌, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే.. రుషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే వారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మూడు రాజధానుల అంశం, విశాఖ పరిపారాలనా రాజధాని అన్న విషయం తెరపైకి వచ్చిన కొన్ని రోజులకే…

Read More

Health Benefits of cardamom | Yalakulu Health Tips | యాలకుల వల్ల లాభాలు

  Health Benefits of cardamom : హిందీలో ఎలైచి అని పిలువబడే ఏలకులు, సాంప్రదాయ ఔషధం మరియు పాక పద్ధతుల్లో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న అత్యంత విలువైన మసాలా. ఈ సుగంధ మసాలా జింగిబెరేసి కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల నుండి తీసుకోబడింది మరియు దాని విలక్షణమైన రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ, మేము ఏలకులు ఎలాచి యొక్క విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా విశ్లేషిస్తాము. 1. జీర్ణ ఆరోగ్యం ఏలకులు దాని జీర్ణ లక్షణాలకు విస్తృతంగా గుర్తించబడ్డాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది, ఇది జీర్ణక్రియను పెంచుతుంది మరియు అజీర్ణం, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి వివిధ జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. మసాలాలో కార్మినేటివ్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది అపానవాయువు మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా,…

Read More

ACP on BJP MLA candidate | బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై చేయిచేసుకున్న ఎసిపి | Eeroju news

ACP on BJP MLA candidate

బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై చేయిచేసుకున్న ఎసిపి హైదరాబాద్ జూన్ 18 ACP on BJP MLA candidate బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై ఎసిపి చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ హోటల్ మూసివేస్తుండగా బిజెపి నేత అమర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో వెంటనే అమర్ సింగ్‌పై ఎసిపి కిషన్ చేయి చేసుకున్నాడు. దీంతో అమర్ సింగ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కార్వాన్ బిజెపి అభ్యర్థిగా కిషన్ సింగ్ పోటీ చేశారు. ప్రజాప్రతినిధులు పోలీసులతో మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   Between Congress and BJP Coal Mines Panchayat |…

Read More

Officers and staff should follow the time regime | అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి | Eeroju news

Officers and staff should follow the time regime

అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి,  Officers and staff should follow the time regime అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం  ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రత లేకుండా  పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఐడిఓసి లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంటును పరిశీలించారు. మొదటి విడతగా ఏర్పాటు చేసిన 100 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ద్వారా కలెక్టర్ కార్యాలయం వరకు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.…

Read More