పుంగనూరులో వైసీపీకి షాక్ తిరుపతి, జూన్ 28, (న్యూస్ పల్స్) Shock for YCP in Punganur వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపిలో చేరికలు పెరిగాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. స్థానిక టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అదే జరిగితే పుంగనూరు మున్సిపల్ పీఠం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరినట్టే. పుంగనూరు నుంచి సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి కుటుంబం హవా నడుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి హవా చలాయించడం ప్రారంభించారు.…
Read MoreTag: YCP
Satires on pictures… | జగన్ పై సెటైర్లు… | Eeroju news
జగన్ పై సెటైర్లు… విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్) Satires on pictures ఎక్కువ ఎంపి స్థానాలు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఏపీ రూపురేఖలే మార్చేస్తాను.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూ వారికే మద్దతు ఇచ్చారు జగన్. పార్లమెంట్ లోని రెండు సభల్లో సైతం.. ఈ సందర్భంలోనైనా బిజెపికి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు.. ఇలా ఒకటేంటి అన్నింటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత ఐదు సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్. ఎన్నికల్లో బిజెపితో పొత్తు…
Read MoreMerger of YCP with Congress | కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… | Eeroju news
కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Merger of YCP with Congress సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ను ఖాళీ చేసేందకు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ ఎన్నిక జరిగింది. తొలి కేబినెట్ భేటీ కూడా జరిగింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి వస్తారా.. వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో…
Read More26 districts…42 acres… | 26 జిల్లాలు…42 ఎకరాలు… | Eeroju news
26 జిల్లాలు…42 ఎకరాలు… వైసీపీ ప్యాలెస్ ల బాగోతం భూముల విలువ 688 కోట్లు విశాఖపట్టణం, జూన్ 25, (న్యూస్ పల్స్) 26 districts…42 acres… రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు.. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేసామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి.. ప్యాలెస్లలోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసుల్ని కూడా కోటల్లా నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి రుషికొండ ప్యాలెస్ను నిర్మించుకుంటే.. ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీసు పేరుతో ప్యాలెస్లు కట్టేసుకుంది. ఇప్పుడా భాగోతాలు బయటపడుతూ.. ఆ కట్టడాల సోయగాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ.. ఇలా ఊరూరా…
Read MoreDoubts on the secrets of Rushikonda | రుషికొండ రహస్యాలపై అనుమానాలు | Eeroju news
రుషికొండ రహస్యాలపై అనుమానాలు విశాఖపట్టణం, జూన్ 22, (న్యూస్ పల్స్) Doubts on the secrets of Rushikonda : విశాఖ పర్యాటక కేంద్రం. రుషికొండ అందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చే ముందు వరకు రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24 కలిపి మొత్తం 58 గదులు ఉండేవి. పర్యాటకులు ఆన్లైన్లో గదులు బుక్ చేసుకుని అక్కడ బస చేసే వారు. రెస్టారెంట్, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే.. రుషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే వారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మూడు రాజధానుల అంశం, విశాఖ పరిపారాలనా రాజధాని అన్న విషయం తెరపైకి వచ్చిన కొన్ని రోజులకే…
Read Moreవైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news
వైసీపీకి పునర్విభజన… టెన్షన్ తిరుపతి, జూన్ 17,(న్యూస్ పల్స్) Redistribution to YCP… tension : ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ…
Read Moreఈవీఎంలపైనే తప్పంతా… | Everything is wrong with EVMs… | Eeroju news
ఈవీఎంలపైనే తప్పంతా… మరి మార్పు ఎప్పుడు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Everything is wrong with EVMs : వైఎస్ఆర్సీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ? . ఇప్పడా పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. 2024 ఘోర ఓటమికి మాత్రం ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు. ఈవీఎంలను విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు మంచే చేశామంటున్నారు. బహిరంగసభల్లో చెప్పినవన్నీ మళ్లీ మళ్లీ చెబుతున్నారు. మేనిఫెస్టోను అమలు చేశామంటున్నారు. కొంత మంది నేతలు సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులుగా ఉన్న ధనుంజయరెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయానికి బాధ్యత…
Read Moreవైసీపీకి దూరమైన బీసీలు… | BCs away from YCP… | Eeroju news
వైసీపీకి దూరమైన బీసీలు… ఏలూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) BCs away from YCP : ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మొదటిలోనే ప్రశ్నించే గొప్ప అవకాశాన్ని వదులుకుంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి సపోర్టు చేశారు. దీంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం అదే బీసీలు కూటమికే జై కొట్టారు. దాని ఫలితమే.. వైసీపీ ఘోర ఓటమి. ఏపీలోనే బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీసీ స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కులగణన చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ గట్టిగా ఈ డిమాండ్ చేసింది కాబట్టే.. దేశవ్యాప్తంగా బలపడింది. కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.బీసీ నినాదాలు బలంగా వినిపిస్తున్న సమయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్లమెంట్లో జగన్…
Read Moreవైసీపీ పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే | All the posts of YCP are for that social group| Eeroju news
గుంటూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్…
Read Moreఅసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం…? | YCP away from assembly meetings…? | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. పార్టీల బలాబలాలు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్ష నేత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అసెంబ్లీలో సీట్లు కూడా చివరి వరుసలో కేటాయించే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడ ఉండాలనేది స్పీకర్ ఇష్టం. అయితే గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్నీ గుర్తు పెట్టుకుంటామని టీడీపీ చెబుతోంది. అంటే.. వైఎస్ఆర్సీపీ సభ్యులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు. తర్వాత ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకున్నారు. తమ అధినేతను, వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు…
Read More