జగిత్యాల
ఎన్నికల కమీషనర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషా అన్నారు.మంగళవారం రాత్రి ఐడీవోసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,నవంబర్ 30 న జరుగనున్న శాసన సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని కోరుట్ల,జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలలో అన్ని ఏర్పాట్లు నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాలని అన్నారు.సి -విజిల్,
సువిధ,వంటి వాటి పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని , అవసరమైన సామాగ్రి ముందస్తుగా సమకూర్చలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేపట్టాలని,పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకునేందుకు వాహనములు సమకూర్చాలని అన్నారు. మాడల్ కోడ్ ను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అమలు పరచాలని అన్నారు.ఎన్నికల నిర్వహణకు ఆయా రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలనీ అన్నారు.ఆనంతరం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగం పై రూపొందించిన స్టిక్కర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీవోలు నరసింహ మూర్తి ,రాజేశ్వర్ ,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Post