Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన

0

కర్నూలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో  తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 19 తేదీన ప్రజాగళం పేరుతో పర్యటించునున్నారు.అందులో భాగంగా టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలోజాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సోమశిట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితర జిల్లా నాయకులు హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్క రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీ ఆలూరు నియోజకవర్గం లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయిందని, ప్రతి టిడిపి కార్యకర్త దాదాపు 50 వేల మందిని పాల్గొనేలా చూడాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని కోరారు, హెలీపాడ్ స్థలం నుంచి బయలుదేరి ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారన్నారు. ఆలూరు నియోజకవర్గం ప్రజలందరూ ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie