నూజివీడు
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డైరెక్టర్ వచ్చి చెప్పినా ఆపకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో క్యాంపస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..