విజయవాడ
బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్ర ప్రదేశ్ కు సైతం లాభదాయకం ఉంది. 80 కోట్ల ప్రజలకు ఫ్రీ ఉచితంగా బియ్యం. పేదలకు సొంతంటి కల బీజేపీ తోనే సాధ్యమని ఎపి బిజెపి ఎన్నికల సమన్వయ కర్త పేరాల చంద్ర శేఖర్ అన్నారు.
కుల వృత్తులు రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది. డబల్ ఇంజన్ సర్కారు వస్తె ప్రజలకు మేలు జరుగుతుంది. వైసిపి పెద్ద ఎత్తున్న దొంగ ఓట్లు సృష్టించింది. దొంగ ఓట్లు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
క్రిస్టియన్ ముస్లిం ఇలా అన్ని వర్గాల ప్రజలను బీజేపీ ఆదరిస్తుంది. ముస్లిం క్రిస్టియన్ లకు బిజెపి వ్యతిరేకం కాదు. ఈశాన్య రాష్ట్రాల లో 60క్రిస్టియన్ ఎమ్మెల్యే లు బిజెపి తరపున గెలుపొందారని అన్నారు.
అస్సాం లో 35 శాతం ముస్లిం లు ఉన్నప్పటికీ బిజెపి అఖండ మెజారిటీతో విజయం సాధించాం. వైసీపీ బిజెపి పై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో వక్ఫ్ బోర్డు భూములు ఎంత రక్షణ కల్పించాం చూపిస్తాం అంటూ వైసీపీ పై ఆరోపణలు సంధించారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లిం లు పేదరికం లో మగ్గిపోవడానికి కారణం వైసీపీ కారణం అన్నారు. కేవలం వైసిపి అబద్ధ ప్రచారం మాత్రమే. ముస్లిం క్రిస్టియన్ వర్గాలు సైతం బీజేపీ కూటమి అభ్యర్థులకు బాసటగా నిలవాలి. పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు