కమాన్ పూర్
సామాజిక కార్యకర్త గాలపల్లి కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నిత్య రక్తదాత ఆపదలో ఉండి రక్తం కావాలని అడిగితే ఎప్పుడైనా రక్తం అందించే మహానుభావుడు గాలపల్లి కుమార్ పుట్టినరోజు సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన నివసించే అనాధలు మరియు భిక్షాటన చేసే వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా తుమ్మ నిశాంత్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడమే అని అన్నారు కుమార్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ రక్తం అవసరమని ఫోన్ చేస్తే రక్తం అందించే గొప్ప వ్యక్తి అందుకే మేము తన పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో నిత్య అన్నదాన కార్యక్రమం భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆషాడపు క్రాంతి కుమార్ కుర్మా ధీరజ్ తదితరులు పాల్గొన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలి ఉన్నవారికి అన్నం విలువ తెలుస్తుంది. అందుకొరకే అన్నార్తులకు ఆకలి అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
Prev Post