హైదరాబాద్
వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. దిల్ సుఖ్ నగర్ కళ్యాణ్ నగర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సంక్షేమ పథకాల్లో. స్థానిక ఎన్నికల్లో వికలాంగుల ఛట్ఠం ప్రకారం 5 శాతం కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్టంలో వికలాంగుల కేసుల పరిష్కరానికి సెక్షన్ 83.84 ఆర్ పిడి యాక్ట్ ను అమలు పరిచి ప్రత్యేక కోర్టులు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ను నియమించాలని కోరారు.తెలంగాణ లో 20 లక్షల కుటుంబాలలో 80 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు.ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కి వినతిపత్రాన్ని అందజేసినట్లు వివరించారు.
Next Post