Andhra Pradesh:జూన్ 12 నాటికి 3 లక్షల గృహప్రవేశాలు

3 lakh home visits by June 12

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటై.. మరికొన్ని రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రేంజులో ఘన విజయం అందుకుంది ఎన్డీఏ కూటమి. మొత్తం 175 స్థానాలకు గానూ.. 164 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జూన్ 12 నాటికి 3 లక్షల గృహప్రవేశాలు

విజయవాడ, ఏప్రిల్ 21
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటై.. మరికొన్ని రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రేంజులో ఘన విజయం అందుకుంది ఎన్డీఏ కూటమి. మొత్తం 175 స్థానాలకు గానూ.. 164 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా నారా లోకేష్ సహా కీలక నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి వచ్చే జూన్ 12తో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీఏ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తైన సందర్భంగా కొత్తగా నిర్మించిన 3 లక్షల ఇళ్లను ప్రారంభించి.. గృహప్రవేశాలు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు జూన్ 12వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.

మూడు లక్షల మంది పేదలకు ఇళ్లను అందించి.. అదేరోజు వారితో గృహప్రవేశాలు చేయించేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 12 వ తేదీ లోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మూడు లక్షల ఇళ్లల్లో ఇప్పటి వరకూ 1.70 లక్షలు పూర్తికాగా.. మరో 60 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించేందుకు ప్రభుత్వం అదనపు సాయం కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు చొప్పున, ఎస్టీలకు రూ.75 వేలు చొప్పున ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు సాయం అందిస్తున్నారు. గడువులోగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రతిరోజూ జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు. పనులను గడువులోగా పూర్తి చేసేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Read more:Andhra Pradesh:బీసీ సభలో ఓసీ నాయకుడు హవా

Related posts

Leave a Comment