Trip to Pithapuram from 1st July | జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన | Eeroju news

Trip to Pithapuram from 1st July

జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన కాకినాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Trip to Pithapuram from 1st July : జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు.…

Read More

Gazetted Note on New Districts | కొత్త జిల్లాలపై రాని గెజిట్ నోట్ | Eeroju news

Gazetted Note on New Districts

కొత్త జిల్లాలపై రాని గెజిట్ నోట్ ఒంగోలు, జూన్ 26, (న్యూస్ పల్స్) Gazetted Note on New Districts ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తై రెండేళ్లు దాటుతున్న రాష్ట్రపతి అమోద ముద్ర మాత్రం లభించలేదు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజక వర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. స్థానికుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో ఏక పక్షంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించేశారు.కేవలం అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే అప్పట్లో ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విజయ్‌కుమార్‌ జిల్లాల పునర్విభజన చేశారనే ఆరోపణలు ఉన్నాయి.తాజాగా ఈసెట్ అడ్మిషన్ల నేపథ్యంలో కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాలు విశాఖపట్నం ఏయూ పరిధిలోనే ఉంటాయని ఈసెట్‌ కన్వీనర్ ప్రకటించారు. ఏపీలో జిల్లాల పునర్విభజనకు ఇప్పటికీ రాష్ట్రపతి అమోద ముద్ర లభించకపోవడంతో…

Read More

Peddireddy family into BJP… | బీజేపీలోకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ… | Eeroju news

Peddireddy family into BJP

బీజేపీలోకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ… తిరుపతి, జూన్ 26, (న్యూస్ పల్స్0 Peddireddy family into BJP.. పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని వీడనుందా? పార్టీ మారనుందా? బిజెపిలో చేరనుందా? ఇప్పుడు ఎక్కడ చూడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. కాంగ్రెస్ లో రాణించిన ఆయన వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. అయితే ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో.. పెద్దిరెడ్డి కుటుంబం బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయినా బిజెపి నుంచి అంతగా సానుకూలత రావడంలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై మాట్లాడిన బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బిజెపి హై కమాండ్ కు టచ్ లోకి వెళ్లినట్లు…

Read More

Pawan with a clear plan… | పక్కా ప్లాన్ తో పవన్…. | Eeroju news

Pawan with a clear plan....

పక్కా ప్లాన్ తో పవన్…. విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Pawan with a clear plan…. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే వరుసగా చేసిన సమీక్షలతో పవన్ యాక్షన్ ప్లాన్‌పై క్లారిటీగా ఉన్నారనే సంకేతాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయా శాఖల ప్రగతి, జరిగిన పనులు, చేయాల్సిన అభివృద్ధిని పవన్ సమీక్షిస్తున్న తీరు, శాఖాపరమైన పాలనలో కొత్త ఉత్సాహం తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు గ్రామాల భవితకు కొత్త మార్గాలు వేస్తుందనే భావన అందరిలోనూ కలిగించినట్లు పలు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ పరిథిలోని ఐదు శాఖలపై పట్టు సాధించే దిశగా తొలి అడుగులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, అటవీ, శాస్ర్త సాంకేతిక శాఖల…

Read More

Politics around party offices | పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం | Eeroju news

Politics around party offices

పార్టీ ఆఫీసుల చుట్టూ రాజకీయం కాకినాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Politics around party offices : ఏపీలో ప్రస్తుత రాజకీయం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ.. రాజప్రాసాదాలను తలపించేలా పార్టీ భవనాలు నిర్మించారని టీడీపీ ఆరోపిస్తుంటే.. అనుమతులు లేకుండా అడ్డగోలుగా టీడీపీ భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు వైసీపీ అభియోగాలు మోపుతోంది.జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజాధనంతో.. ప్రభుత్వ భూముల్లో ఎన్నో భవనాలు నిర్మించారు. వాటిని పార్టీ ఆఫీసులుగా మార్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అనుతుల్లేకుండా.. పార్టీ కార్యాలయాల పేరిట నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసింది.తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావచ్చిన బిల్డింగ్‌ను కూల్చేసిన నేపథ్యంలో.. మిగతా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నారు. ఏలూరు నడి బొడ్డున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం ప్యాలెస్‌ని తలపించేలా నిర్మించడంతో..…

Read More

TDP shock for volunteers | వలంటీర్లకు టీడీపీ షాక్ | Eeroju news

TDP shock for volunteers

వలంటీర్లకు టీడీపీ షాక్ గుంటూరు, జూన్ 26, (న్యూస్ పల్స్) TDP shock for volunteers ఏపీలో జూలై 1న పింఛన్ల పంపిణీ జరగనుంది. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వేల రూపాయలతో పాటు మూడు నెలలకు సంబంధించి పెండింగ్ 3000 తో కలిపి.. మొత్తం 7000 అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది ఒక విధంగా జగన్ కు షాక్ ఇచ్చే అంశమే. ఆది నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచే విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు మరోసారి పింఛన్ మొత్తాన్ని 3000 నుంచి 4వేల రూపాయలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సామాజిక పింఛన్ లబ్ధిదారుల అభిమానాన్ని పొందుతున్నారు. ఏపీలో సంక్షేమానికి ఆధ్యుడు నందమూరి తారక రామారావు. అయితే ఆయన హయాంలో పింఛన్…

Read More

Merger of YCP with Congress | కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… | Eeroju news

Merger of YCP with Congress

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Merger of YCP with Congress సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసేందకు అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్‌ ఎన్నిక జరిగింది. తొలి కేబినెట్‌ భేటీ కూడా జరిగింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో జగన్‌ అసెంబ్లీకి వస్తారా.. వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో…

Read More

Nothing but Sotkarsha… | సోత్కర్ష తప్ప ఏమి లేదా… | Eeroju news

Nothing but Sotkarsha...

సోత్కర్ష తప్ప ఏమి లేదా… విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Nothing but Sotkarsha… ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతలతో వరుసగా మీటింగులు పెడుతున్నారు. సమీక్షలు జరుపుతున్నారు. కానీ, ఆయన చెప్పాలనుకున్నదే చెబుతున్నారు తప్పా.. ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదు. నిజాయితీగా రాజకీయాలు చేయడం వలనే ఓడిపోయానని ఆయన పార్టీ నేతలతో చెప్పడం వినడానికి ఇంపుగా ఉంది. మొదటి నుంచి జగన్ అదే విషయం చెబుతున్నారు. అక్కా చెల్లెమ్మలకు, అవ్వా తాతలకు చేసిన సేవ ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ నెంబర్ సీట్లే వస్తాయని ఆశపడుతున్నారు. ఇవే తప్పా.. అసలు ఓటమికి కారణం ఏంటీ అని మాత్రం విశ్లేషించుకోలేకపోతున్నారు. అసలు ఆ దిశగా అడుగులు కూడా…

Read More

‘S Boss’ team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed | హీరో హ‌వీష్‌కి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’ టీమ్‌.. సినిమా షూటింగ్ పూర్తి | Eeroju news

'S Boss' team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed

హీరో హ‌వీష్‌కి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ‘ఎస్ బాస్’  టీమ్‌.. సినిమా షూటింగ్ పూర్తి ‘S Boss’ team wishes birthday wishes to hero Haveesh. Film shooting completed ప్ర‌ముఖ నిర్మాత‌, విద్యావేత్త‌, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ చైర్మ‌న్ కొనేరు స‌త్య‌నారాయ‌ణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్ష‌సుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ఆయ‌న ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు. కాంచ‌న కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘సెవన్’ తర్వాత డైన‌మిక్ యాక్ట‌ర్ హ‌వీష్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన హ‌వీష్, ‘రామ్ లీల‌’, ‘జీనియ‌స్’ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని…

Read More

A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

A review of bonala arrangements in Balkampeta temple

బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్ A review of bonala arrangements in Balkampeta temple బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ  దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం…

Read More