విశాఖపట్నం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడును అధిష్ఠానం సస్పెండ్ చేసింది.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.పెందుర్తికి చెందిన చినఅప్ప లనాయుడుకు స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్రాజ్తో విభేదాలు ఉన్నా యి. కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓట మికి ఎమ్మెల్యేనే కారణమని శరగడం భావించారు.
దీంతో అప్పటినుంచి గొడవలు రచ్చకెక్కాయి. పెందుర్తిలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చినఅప్పలనాయుడును ఆహ్వానించ డం లేదని ఇటీవల ఆయన అనుచరు లు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ను అడ్డుకున్నారు.ఈ పరిణామాల నేప థ్యంలో శరగడం చినఅప్పలనాయు డును పార్టీ నుంచి అధిష్ఠానం సస్పెండ్ చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది.