- రెండు భాగాలుగా విడిపోయింది
- సైన్యానికి అవకాశం ఇవ్వని మోడీ
- ప్రధానిపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
మణిపూర్తగలబడుతుంటే దేశ ప్రధాని మోడీ మాత్రం పార్లమెంట్లో నవ్వుతూ సమాధానం ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు, రాష్ర్టవ్యాప్తంగా అసలు మనిషన్నవారు బతకలేని రీతిలో హింస చెలరేగుతుంటే అలాంటి అంశంపై కేవలం రెండు నిమిషాలే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గురువారం పార్లమెంట్లో ప్రధాని అడిగిన ప్రశ్నలకు శుక్రవారం రాహుల్గాంధీ విలేఖరుల సమావేశంలో సమాధానమిచ్చారు. పార్లమెంట్లో ప్రధాని జోకులు వేశారని, నవ్వారని దుయ్యబట్టారు. విషయం మణిపూర్హింసపై మాట్లాడాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీపైనే రెండు గంటలు మాట్లాడారని విమర్శించారు. తాను 19 యేళ్లుగా రాజకీయాలలో ఉన్నానన్నారు. ఇన్ని సంవత్సరాలుగా భారత్లో ఎన్నో క్లిష్టపరిస్థితులను చూశానన్నారు. వరదలు, భూకంపాలు, సునామీలు ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా నిలుస్తూ వస్తోందన్నారు. బాధితులు చెప్పింది సావధానంగా వింటామన్నారు.
కానీ మణిపూర్లో బాధితులు చెప్పింది ఇన్ని యేళ్లలో ఎక్కడ వినలేదన్నారు. అమిత్షా, ప్రధాని మణిపూర్లోనే భారత్ను చంపేశారన్నారు. ఇప్పటికే మణిపూర్పలు ప్రాంతాలుగా విభజన జరిగిందని ఆరోపించారు. తాము అక్కడికి వెళ్లినప్పుడు మైతేయి బాధితులను సందర్శించేందుకు వెళ్లామన్నారు. అప్పుడు మైతేయి బాధితులు తమతో కుకీలు ఎవరైనా ఉంటే మీ వెంట తీసుకురాకండి లేదంటే మేమే వారిని చంపేస్తాం.. ఆ తరువాత బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారన్నారు. అదే కుకీ ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా వారు కూడా అలాగే మైతేయిలను బుల్లెట్లతో కాల్చివేస్తామని హెచ్చరించారన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఆ ఇరువర్గాల వారు తమ వెంట లేకుండా చూసుకున్నామన్నారు. దీంతో మణిపూర్రెండు భాగాలుగా విభజించబడిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
అందుకే తాను అంటున్నానని మణిపూర్లో భారత్ హత్య జరుగుతుంటే.. ప్రధాని మోడీ పార్లమెంట్లో నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. భారతీయ సైన్యం మణిపూర్లో హింసను రెండు రోజుల్లోనే ముగించగలదన్నారు. ఆ సత్తా సైన్యానికి ఉందన్నారు. కానీ ప్రధాని సైన్యానికి ఆ ఆదేశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మణిపూర్తగలబడుతుంటే చూస్తున్నారన్నారు. మంటలను చల్లార్చే ప్రయత్నం ప్రధాని చేయడం లేదన్నారు. ప్రధాని స్వయంగా ఇరు వర్గాల సముదాయాల నేతలతోనైనా మాట్లాడి హింసను తగ్గించే చర్యలు ఇప్పటివరకూ ఎందుకు తీసుకోలేదన్నారు. కానీ ప్రధాని ఆ ప్రయత్నమూ చేయలేదన్నారు. 2024లో ప్రధానిగా మోడీ అవుతారా? కారా? అన్నది ప్రశ్న కాదని, మణిపూర్లో అమాయకుల ప్రాణాలను రక్షించడం ఎలాగన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాహుల్గాంధీ అన్నారు.