ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన దమ్మయ్మపేట గ్రామస్తులు
చొప్పదండి
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం దమ్మయ్మపేట గ్రామంలో పలువురు ఒడ్డెర సంఘం నాయకులు 50 మంది బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, భారాస పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, దమ్మయ్య పేట,చింతల్ల పల్లి సర్పంచ్ లు తునికి నర్సయ్య, మల్యాల మహిపాల్,నాయకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, మీడియా సెల్ నియోజకవర్గ కన్వీనర్ మొగిలిపాలెం రమేష్ తదితర నాయకులున్నారు.